Gossipsకోరిక తీరిస్తే.. గంట‌కు రెండు ల‌క్ష‌లు.. ప్ర‌ముఖ హీరోయిన్ సంచ‌ల‌నం..!

కోరిక తీరిస్తే.. గంట‌కు రెండు ల‌క్ష‌లు.. ప్ర‌ముఖ హీరోయిన్ సంచ‌ల‌నం..!

కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటివి దేశం మొత్తం హంగామా చేస్తున్న ఈ టైంలో ఓ మళయాళ నటికి వేధింపులు జరగడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అది ఇండస్ట్రీ వాళ్ల పని కాదని తెలుస్తుంది. మళయాళ నటి అయిన గాయత్రి అరుణ్ ను ఒక్కరాత్రికి వస్తావా 2 లక్షలు ఇస్తా అది కూడా గంటకే అంటూ ఓ వ్యక్తి మెసేజ్ చేశాడట. అతని మెసేజ్ చూసి మండిపడ్డ గాయత్రి అరుణ్ దేవుడుని ప్రార్ధించే టైంలో తాను అతని తల్లి, సోదరిలు క్షేమంగా ఉండాలని కోరుకుంటా అని చెప్పింది.
1
రోహన్ అనే వ్యక్తి ఓ రాత్రికి వస్తే 2 లక్షలు ఇస్తా అని గాయత్రి అరుణ్ కు ఆఫర్ చేశాడట. అతని వేధింపులను బహిర్గతం చేసింది గాయత్రి అరుణ్. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే రోహన్ ఓ మైనర్ కావడం వల్ల అతని మీద కేసు పెట్టలేదట. రోహన్ తల్లిదండ్రులు చెప్పడం వల్ల గాయత్రి అరుణ్ కేసు పెట్టకుండా వదిలేసిందట. మరి మైనర్ అయిన వాడికి 2 లక్షలు ఇస్తా అని ఎలా చెప్పగలిగాడో అని డౌట్ పడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు, హీరోల మీద మీటూ అంటూ హీరోయిన్స్ తమకు జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు.
2
బాలీవుడ్, శాండల్ వుడ్ లో మీటూ ప్రభావం ఎక్కువగా ఉంది. టాలీవుడ్ లో మీటూ గురించి మాట్లాడే ధైర్యం చేయట్లేదు. తెలుగు పరిశ్రమ మీద ఒక్క రాధికా ఆప్టే మాత్రమే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మీద శ్రీ రెడ్డి పెద్ద యుద్ధమే చేసినా ఆమె కొంతమందిని మాత్రమే టార్గెట్ చేయడంతో ఆ వివాదం పక్కన పెట్టాల్సి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news