Gossipsఎన్టీఆర్,బాలయ్య ల మధ్య విబేధాలు తగ్గలేదా..?

ఎన్టీఆర్,బాలయ్య ల మధ్య విబేధాలు తగ్గలేదా..?

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది నిజమే అని అంత నమ్మారు. ఇంకేముంది ఆ ఫంక్షన్ లో అబ్బాయికి సపోర్టుగా బాబాయ్ భారీ డైలాగులు చెబుతాడని అంతా ఆశపడ్డారు. కానీ అందరికి నిరాశే మిగిలింది. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రమే ఆ కుటుంభం నుంచి హాజరయ్యారు. తమ్ముడికి సపోర్ట్ గా ఫ్యాన్స్ ఉద్దేశించి మాట్లాడారు.

అయితే ఇప్పుడు ఆ ఫంక్షన్ కి బాలయ్య రాకపోవడానికి కారణం ఏంటి..? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. గతం లో బాబాయ్ అబ్బాయ్ కి మధ్య చిన్న చిన్న విబేధాలు తలెత్తాయి, ఆ విబేధాల నేపథ్యంలో ఏడ మొఖం పెడమొఖంగా ఉండేవారు. అయితే ఆ తరువాత అవన్నీ సర్దుకున్నట్టు కనిపించాయి.

ఇటీవల ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణించడంతో ఆ కార్యక్రమాలు చూసే సమయం లో బాబాయ్ అబ్బాయ్ మధ్య మంచి సన్నిహితం ఏర్పడిందని ఇక తండ్రి లేని లోటు బాలయ్య తీరుస్తాడని అంతా భావించారు. అయితే వారు ఆసమయంలో కలిశారు తప్ప వారిద్దరి మధ్య ఇంకా విబేధాలు పోలేదని, అందుకే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య రాలేదనే వార్తలు ఇప్పడు ఫిలిం నగర్ లో చక్కెర్లు కొడుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news