Gossipsఎన్టీఆర్ స్టామినా అంటే ఇది.. ఎదురెవరొచ్చినా రికార్డు స్థాయిలో బిజినెస్ ..!

ఎన్టీఆర్ స్టామినా అంటే ఇది.. ఎదురెవరొచ్చినా రికార్డు స్థాయిలో బిజినెస్ ..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. టీజర్ తో అంచనాలను తారాస్థాయిలో ఉండేలా చేసిన తారక్ సినిమా కూడా ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా చేస్తున్నాడట. దసరా కానుకగా సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండస్ట్రీని షేక్ ఆడించేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రాలో ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది జై లవకుశ.

కేవలం ఆధ్రా వరకే 36 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. దసరా బరిలో దిగుతున్న స్పైడర్, పైసా వసూల్ సినిమాల కన్నా ఎన్.టి.ఆర్ జై లవకుశ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. అదే అంచనాలను బిజినెస్ లో కూడా కంటిన్యూ చేస్తుంది. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 70 కోట్ల దాకా బిజినెస్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు తారక్. సినిమా మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ రాం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదట.

రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న జై లవకుశలో ట్రిపుల్ రోల్ లో తారక్ కనిపించనున్నాడు. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ను అంచనాలను దాటి వెళ్తున్న తారక్ ఇక వాటిని క్రాస్ చేసి రికార్డుల పని పడతాడని ఆశిస్తున్నారు అభిమానులు. ఎన్.టి.ఆర్ బాక్సాఫీస్ బీభత్సం ఏంటి అన్నది సెప్టెంబర్ 21న చూడాల్సిందే మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news