Gossipsవీరిద్దరిని అందుకే కాదన్న... కానీ ఇప్పుడు బాధపడుతున్న

వీరిద్దరిని అందుకే కాదన్న… కానీ ఇప్పుడు బాధపడుతున్న

మంచి కథాబలమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ ప్రేమ అలియాస్ యమున. ‘మౌన పోరాటం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యమున నటన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది. తరువాత తరువాత సినిమాలకి దూరం అయ్యి మళ్ళీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ మధ్య ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత వివరాలు పంచుకుంది ఈ నటీమణి.

ఇండస్ట్రీ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారితో నటించకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ తనకి అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ గారి సినిమాలలో అవకాశం వచ్చాయి. కానీ ‘మౌన పోరాటం’ తరువాత అదే బ్యానర్లో రెండు సినిమాలు ఒప్పుకుని ఉండడంవల్ల మరో సినిమా చేయలేకపోయాను. చిరంజీవిగారి ‘కొదమసింహం’ సినిమా సమయంలో.. ఆయనతో ఓ సినిమా కోసం నన్ను అనుకున్నారని అప్పట్లో కైకాల సత్యనారాయణగారు చెప్పారని యమున చెప్తోంది.

బాలకృష్ణ సినిమా కోసమని నా గురించి ఉషా కిరణ్ మూవీస్ వారిని కూడా సంప్రదించారని తెలిసింది. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్ లేకపోవడం వల్ల సరైన సమాచారం లేకపోవడంతో కొన్ని అవకాశాలు మిస్సయ్యానాని చెప్పుకొచ్చింది. తాను స్టార్ హీరోల పక్కన నటించలేనందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news