Gossipsఅర్జున్ రెడ్డిని పట్టేసిన జై లవ కుశ ..!

అర్జున్ రెడ్డిని పట్టేసిన జై లవ కుశ ..!

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇవేకాకుండా క్రేజీ ప్రాజెక్టులను సైతం చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈమధ్యనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ అంటూ నట విశ్వరూపం చూపేలా చేసిన బాబి తన తర్వాత సినిమా కథ సిద్ధం చేసుకున్నాడట.

ఇక తను రాసుకున్న కథకు విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ అనిపించి అతనితో స్టోరీ డిస్కస్ చేశాడట. బాబి చెప్పిన లైన్ విజయ్ కు నచ్చేయడమంతో కాంబో సెట్ అవనుందని తెలుస్తుంది. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఏమత్రం వేశావే సినిమాతో రాబోతున్నాడు. శ్రీధర్ మర్రి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

ఇక పరశురాం డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో కూడా మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ రెండు సినిమాల తర్వాత బాబితో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి జై లవ కుశ దర్శకుడు విజయ్ తో చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news