Gossipsవెంకటేశ్ తో విభేదాలు ఎంతవరుకు నిజం ?

వెంకటేశ్ తో విభేదాలు ఎంతవరుకు నిజం ?

వరస ఫ్లాప్స్ తో వున్నా ఎనేర్జిటిక్ హీరో రామ్ పోతినేని కి డైరెక్టర్ కిశోరె తిరుముల తురుపు ముక్కలా దొరికాడు . ఒక నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీ లో మల్లి నిలదొక్కుకున్నాడు రామ్.
దీంతో తదుపరి సినిమా కూడా కిషోర్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఉన్నది ఒకటే జిందగీ అంటూ వినూతన టైటిల్ తో షూట్ పూర్తి చేసుకుని విడుదల కి సిద్దం అవుతున్న ఈ సినిమా ఈ నెల 27 న థియేటర్ లలోకి రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్నారు ఈ చిత్ర బృందం మొత్తం . ఒక వీడియో ఇంటర్వ్యూ లో తన సినిమా విశేషాలు వరసపెట్టి చెప్పిన డైరెక్టర్ కిషోర్ ఈ సినిమా తరవాత చెయ్యాల్సిన సినిమాల ప్రస్తావన లో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ ప్రస్తావన వచ్చింది.
ఈ సినిమాను ఆయన కొంతకాలం క్రితమే వెంకటేశ్ తో చేయవలసి వుంది. ఆ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.అందుకు కిషోర్ తిరుమల స్పందిస్తూ .. ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని చెప్పారు. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, ఇతర ప్రాజెక్టులతో అటు వెంకీ .. ఇటు తాను బిజీగా ఉండటం వలన ఆలస్యమైందని అన్నారు.
వెంకటేశ్ తో తనకి విభేదాలు వచ్చాయనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనీ, ఆయనతో తప్పకుండా ఆ సినిమా తీస్తాను అన్న విషయాన్ని స్పష్టం చేశారు. హీరో నాని తో కూడా ఒక సినిమాకి ప్లాన్ చేస్తున్నాము అనీ అది కూడా స్క్రిప్ట్ దాదాపు ఆఖరి స్టేజీ లో ఉంది అనీ చెప్పారు ఆయన.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news