Newsఘోర కారు ప్రమాదంలో టీఆర్ఎస్ లీడర్‌ మృతి

ఘోర కారు ప్రమాదంలో టీఆర్ఎస్ లీడర్‌ మృతి

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో టీఆర్‌ఎస్‌ నేత మృతిచెందాడు. నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు దుబ్బాక సతీష్‌రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.విశాఖపట్నం నుంచి చిట్యాల వైపు వస్తుండగా.. నార్కెట్‌పల్లి బైపాస్‌ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఈ ప్రమాదం జరిగింది.

సతీష్‌ రెడ్డి భార్య మమత నెరడ ఎంపీటీసీగా పని చేస్తున్నారు. కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో సతీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. సతీశ్ రెడ్డి నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news