Gossipsఎన్టీఆర్ దెబ్బకి జూబ్లి హిల్స్ నుండి పంజాగుట్ట వచ్చిన త్రివిక్రమ్..!

ఎన్టీఆర్ దెబ్బకి జూబ్లి హిల్స్ నుండి పంజాగుట్ట వచ్చిన త్రివిక్రమ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 60 నుండి 70 కోట్ల వరకే రాబట్టగలిగింది. ఈ సినిమా ఫ్లాప్ కు కారణాలు అన్వేషణలో తన ఇంటి ప్రభావం కూడా ఒకటని భావించాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.

అజ్ఞాతవాసి సినిమా టైంలోనే కొత్త ఇంటిలోకి వెళ్లాడు త్రివిక్రమ్. అయితే ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సినిమా కథను మాత్రం తను కెరియర్ మొదలు పెట్టడానికి ముందే ఉన్న రూమ్ లో ప్రిపేర్ చేస్తున్నారట. పంజాగుట్టలో త్రివిక్రమ్ రూం ఉంది. రచయితగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఆ రూమ్ లోనే అద్భుతమైన కథలు.. మాటలు పుట్టాయి. అందుకే ఇప్పుడు ఎన్.టి.ఆర్ సినిమా కోసం ఆ రూమ్ లో కథ సిద్ధం చేస్తున్నాడట.

తన డైరక్షన్ టీం లోని ముగ్గురు వ్యక్తులతో త్రివిక్రమ్ ఆ రూమ్ లో ఉంటున్నాడట. మార్చి నుండి తారక్ సినిమా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news