Gossipsతారక్ రాకతో పోటెత్తిన భద్రాచలం..

తారక్ రాకతో పోటెత్తిన భద్రాచలం..

జూనియర్ ఎన్టీఆర్‌ సతీసమేతంగా శుక్రవారం భద్రాద్రి సీతారాముల్ని దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం తన భార్య లక్ష్మీ ప్రణితితో కలిసి భద్రాద్రి వచ్చిన ఆయన రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు.ఎన్టీఆర్ దంపతులతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆహ్వానం పలికింది.

ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అర గంటపాటు స్వామిసేవలో ఉన్నాడు. తర్వాత స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయసిబ్బంది వారికి అందజేశారు. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.ఆ తర్వాత ఆలయం మొత్తం తిరిగి చూశారు. స్వామి విశిష్ఠత వివరించారు పండితులు.1 (2)

ఇటీవల విడుదల అయిన జైలవకుశ మూవీలో రామాయణంలోని పాత్రలతో తన క్యారెక్టర్లకు పేరు పెట్టారు. ఆ సమయంలో భద్రాచలం వస్తానని ఎన్టీఆర్ మొక్కుకున్నారు. సినిమా విడుదల కావటం.. ఘన విజయం సాధించటంతో భార్యతో కలిసి వచ్చిన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటివలే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ చేతుల మీదిగా క్లాప్ పడింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా పూర్తయిన వెంటంటే తారక్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.2
ఎన్టీఆర్ భద్రాచలం వచ్చిన విషయం తెలిసి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా జనం పోగవ్వడంతో కాస్త తోపులాట జరిగింది.34

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news