Gossipsఎన్టీఆర్ అత్తగా నాగ్ ప్రేయసి..

ఎన్టీఆర్ అత్తగా నాగ్ ప్రేయసి..

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్నాడనే చెప్పుకోవాలి.తన ఇమేజ్ ని రోజురోజుకు పెంచుకుంటూ నువ్వా నేనా అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ మొదటిసారి తన కెరీర్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అభిమానులు మంచి ఉత్కంఠం తో ఎదురు చుస్తునారు.అంతే కాకుండా ఈ సినిమా పై సినీవర్గాలలో బారి అంచనాలు వున్నాయనే చెప్పుకోవాలి.నిన్నటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఈ సిని మాలో రెండో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్ కూడా నటిస్తోందంటూ.. దాదాపుగా ఆమె ఎంపిక కూడా జరిగిపోయిందంటూ మరో వార్త షికారు చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పవన్ హాజరైన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో నటి టబు ముఖ్య పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘అత్తారింటికి దారేది’లో నదియా పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు త్రివిక్రమ్‌. దీని తర్వాత పవన్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలోనూ ఖుష్బూ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తన పాత్ర కథలో కీలకమని, ఆసక్తికరంగా ఉంటుందని ఖుష్బూ గతంలో ట్వీట్‌ చేశారు.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్‌. రాధాకృష్ణ నిర్మాత. కథానాయిక, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. పవన్‌ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’(వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news