Movies‘ధృవ’ నా చివరి సినిమా అంటున్న సురేందర్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

‘ధృవ’ నా చివరి సినిమా అంటున్న సురేందర్ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Tollywood Director Surender Reddy has made some sensational comments on Dhruva saying that this will be his last movie to do. The reason for this will leave you in shock.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇక రకుల ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని చెప్పాడు ఈ ‘కిక్’ డైరెక్టర్. రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నప్పుడు తన దగ్గర ఎలాంటి స్క్రిప్ట్ లేదని.. అప్పుడు చరణ్ స్వయంగా వచ్చి తమిళ చిత్రం ‘తని ఒరువన్’ సినిమాను రీమేక్ చేయమని చెప్పాడట. అలా ఈ సినిమాకు శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి. అయితే రిలీజ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండగా.. తనకు ధృవ సినిమానే చివరిది అంటూ బాంబు పేల్చాడు ఈ డైరెక్టర్. అదేంటి.. మెగా పవర్ స్టార్ లాంటి హీరోతో సినిమా చేసిన డైరెక్టర్‌కు అవకాశాలు వెల్లువెత్తుతాయి కదా.. మరి సురేందర్ రెడ్డి ఇదే తన చివరి సినిమా అంటున్నాడేంటీ.. అనే డౌట్ కలగక మానదు. అయితే దానికి ఓ లెక్కుందండోయ్ మనోడి దగ్గర.

అసలు విషయం ఏమిటంటే.. ‘ధృవ’ ఓ రీమేక్ చిత్రం. కానీ సురేందర్ రెడ్డికి రీమేక్ సినిమాలు చేయడం అంటే అస్సలు ఇష్టం లేదట. కానీ మెగా పవర్ స్టార్ వచ్చి స్వయంగా ఈ సినిమా చేయమనడంతో కాదనలేక చేసేసాడు. ఇప్పుడు ఇక జీవితంలో మళ్ళీ రీమేక్ సినిమాల జోలికి వెళ్లనని చెబుతున్నాడు సురేందర్. ఇక తన తరువాత సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా స్పందించాడు సురేందర్. ఇప్పటికైతే స్క్రిప్ట్‌ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదని కేవలం డిస్కషన్స్ మాత్రమే జరుగుతున్నాయంటూ తేల్చేశాడు. ధృవ సినిమా టైటిల్‌లో 8 అనే నెంబర్ వెనుక సీక్రెట్ మాత్రం రివీల్ చేయలేదు సురేందర్.. ఆ నెంబర్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నాడు సురేందర్ రెడ్డి. మొత్తానికి మెగా పవర్ స్టార్ ‘ధృవ’ సినిమాతో రీమేక్ సినిమాలకు మంగళం పాడేశాడు ఈ కిక్ డైరెక్టర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news