Movies‘ధృవ’ సినిమా నుంచి ‘అతను’ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

‘ధృవ’ సినిమా నుంచి ‘అతను’ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

Finally director Surender Reddy has given clarity why Aseem Mishra left Dhruva movie after one week shoot.

ఈమధ్య చిత్రపరిశ్రమలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టెక్నీషియన్ నుంచి నటీనటుల వరకు ఏదైనా ఓ సినిమా ఒప్పుకున్నాక.. షూటింగ్ మధ్యలోనే ఏదో ఒక వివాదానికి తెరతీయడమో లేదా తప్పుకోవడమో చేస్తున్నారు. ‘ధృవ’ మూవీ విషయంలోనే అలాంటి పరిణామమే ఒకటి జరిగింది.

ఈ మూవీకి మొదట బాలీవుడ్ కెమెరామెన్ అశిమ్ మిశ్రాని తీసుకున్నారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ హిట్ చిత్రాలకు పనిచేసిన అతణ్ణి మంచి పారితోషకమే ఆఫర్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు. అయితే.. వారం రోజులు తిరగకుండానే అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అంతే.. అప్పటినుంచి దానిపై రకరకాల రూమర్లు రావడం మొదలయ్యాయి. యూనిట్‌లో విభేదాలు రావడం వల్లే అతడు తప్పుకున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆ వార్త్లల్లో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించాడు. అతను ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిపాడు.

‘ధృవ’ ఒప్పుకున్న వారం రోజుల తర్వాత అశిమ్ మిశ్రాకి సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ట్యూబ్‌లైట్’ మూవీ ఆఫర్ వచ్చింది. అతని చిత్రాలకి ఆల్రెడీ అశిమ్ పనిచేయడం, సల్మాన్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా.. ఆ అవకాశాన్ని వదులుకోలేక పోయాడు. అందుకే.. రామ్ చరణ్ సినిమాని వదిలేసి వెళ్ళాడని, నిర్మాతల నుంచి తీసుకున్న పారితోషికం కూడా వెనక్కు ఇచ్చేశాడని సురేందర్ క్లారిటీ ఇచ్చాడు. అతనలా వెళ్ళిపోవడం వల్ల అతని స్థానంలో పీఎస్ వినోద్‌ని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోవడం జరిగిందని తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news