Newsసుకుమార్ కొన్ని క్షణాలు అశ్విన్ గా మారితే.. మనసుని తాకే లెటర్..!

సుకుమార్ కొన్ని క్షణాలు అశ్విన్ గా మారితే.. మనసుని తాకే లెటర్..!

మహానటి సినిమా చూసిన ప్రేక్షకులు తమ రెస్పాన్స్ తెలియచేయగా.. సినిమా అద్బుతం అమోగం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రేక్షకులే కాదు సిని సెలబ్రిటీస్ కూడా సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కు రాసిన లెటర్ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇంతకీ సుక్కు రాసిన లెటర్ ఏంటంటే.. మహానటి సినిమా చూసి బయటకొచ్చి నాగ్ అశ్విన్ కు ఫోన్ చేద్దామనుకున్న తనని ఒక ఆవిడ వచ్చి నువ్వు దర్శకుడిగా బాబు అని అడిగిందని.. అవుననే సరికి ఆమె ఏడుస్తూ వాటేసుకుని ఎంత చక్కగా చూపించావయ్యా మా సావిత్రమ్మని అని అన్నదట. అయితే ఆ కొద్ది క్షణాలు తాను నాగ్ అశ్విన్ కాదని చెప్పలేకపోయానని.. ఆవిడ ప్రేమంతా నేను తీసుకున్నా.. ఇంతకన్నా ఆ సినిమా గురించి ఏం చెబుతానని సుకుమార్ లేఖ రాశాడు.

అంతేకాదు ఎప్పటికి ఆమెకి నేను నువ్వు కాదన్న నిజం తెలియకపోతే బాగుండని.. ఇటు సుకుమార్ కొద్ది క్షణాల అశ్విన్ అంటూ మనసుని టచ్ చేసేలా లెటర్ రాశాడు సుకుమార్. ఇలా ఎదుటి దర్శకుడి ప్రతిభ గురించి మాట్లాడే ధైర్యం చేసినందుకు సుకుమార్ ను పొగుడుతున్నారు సిని జనాలు.

sukumar

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news