Newsబిర్యానీ తిని.. మృతిచెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

బిర్యానీ తిని.. మృతిచెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

A sub inspector died after eating biryani. This incident happened in Chennai. Police filed case and started investigation.

అవును.. మీరు చదువుతోంది నిజమే. ఎంతో ఆశగా ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్ బిర్యానీ తింటే, అది అతని ప్రాణాల్ని బలిగొంది. ఈ ఘటన చెన్నై రాష్ట్రం, టీ.నగర్‌లోని ఉలుందూరుపేటలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడలూరు జిల్లా పన్రుట్టి సమీపం పాత పిళ్లయార్‌ కుప్పం ప్రాంతానికి చెందిన షణ్ముఖవేల్‌ (40) ఉలుందూరు పేట పోలీసు స్టేషనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య అరుళ్‌సెల్వి, కుమారుడు నరేనకార్తీక్‌ సొంతూరికి వెళ్ళడంతో.. ఇంట్లో అతను, కుమార్తె కీర్తనా సబిత మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి షణ్ముఖవేల్ డ్యూటీ ముగించుకుని, ఓ దుకాణంలో బిర్యానీ పార్శిల్‌ తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అది తిని తండ్రీకూతుళ్లు ఇద్దరూ పడుకున్నారు.

అయితే.. బుధవారం వేకువజామున షణ్ముఖవేల్‌ ఉన్నట్టుండి వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో.. అతని కుమార్తె కీర్తనా ఉలుందూరు పేట పోలీసులకు కబురు చేయగా.. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని, షణ్ముఖవేల్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించారు కానీ.. అది ఫలించక షణ్ముఖవేల్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news