Gossipsటచ్ చేసి చూడు...రవితేజాది అతి విశ్వాసమా.. అప నమ్మకమా !!

టచ్ చేసి చూడు…రవితేజాది అతి విశ్వాసమా.. అప నమ్మకమా !!

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ లాంటి హిట్ సినిమా తో మన ముందుకి వచ్చిన రవి తేజ, టచ్ చేసి చూడు అంటూ రేపు థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రాశీఖన్నా, శీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్న టచ్ చేసి చూడు ట్రైలర్ జనవరి 26 న విడుదలయేంత వరకు అసలు ఈ సినిమా విడుదల గురించి సరైన సమాచారం కూడా లేదు. సడన్ గా ఫిబ్రవరి 2 న విడుదల అంటూ అందరిని షాక్ కి గురిచేసారు.

సంక్రాంతి సినిమాలు అంతగా సందడి చేయలేదు కాబట్టి అదను చూసుకొని రవి తేజ మంచి టైమ్ లోనే వస్తున్నాడులే అని అందరు భావించారు. కానీ టచ్ చేసి చూడు సినిమా ప్రమోషన్లు మాత్రం ఈ సినిమా గురించి ఏమాత్రం ఆసక్తి ని కలిగించటం లేదు అంతకుమించి దీనిపై నెగటివ్ గా కూడా ప్రభావం చూపేలా సాగుతున్నాయి.అన్ని మీడియా సంస్థలకి ఒకటే వీడియో ఇంటర్వ్యూ ఇచ్చి ప్రమోషన్ చేసిన విధానం చూస్తుంటే రవి తేజాది అతి విశ్వాసమా లేక సినిమా పై నమ్మకాన్ని వదిలేశాడో అర్థం కావడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news