Gossipsదిల్ రాజుకు నో చెప్పిన సాయి పల్లవి..

దిల్ రాజుకు నో చెప్పిన సాయి పల్లవి..

భానుమతి.. హైబ్రీడ్ పిల్ల.. ఒకటే ఫీసు అంటూ వయ్యారంగా డైలాగులు చెప్తూ అందరి మనసు దోచుకున్న మలయాళ కుట్టి సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ ఫిదా చిత్రంతో తెలుగు తెరపై మెరుపులా మెరిసింది సాయి పల్లవి. ఆమె డాన్సులకు, నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు మైమరిచిపోయారు.

సావిత్రి లాంటి నటీమణులకు సాయి పల్లవి వారసురాలు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి దిల్ రాజు బ్యానర్‌లోనే ఎంసీఏ అనే చిత్రంలో నానితో నటిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా … ఇప్పుడు ఈ అమ్మడు తనకు వచ్చిన తాజా ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.

‘ఫిదా’ సినిమా ద్వారా తెలుగు తెరకు సాయిపల్లవిని క‌థానాయిక‌గా పరిచయం చేసారు దిల్ రాజు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ కాసుల వర్షం కురిపించింది. ‘ఫిదా’ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే దిల్ రాజు సంస్థ‌లో మరో రెండు సినిమాలు చేసేందుకు అంగీకరించింది ఈ భామ. నాని హీరోగా తెరకెక్కిన ఆ చిత్ర‌మే ‘ఎం.సి.ఎ.’ ఈ సినిమా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కాబోతోంది.

అయితే మూడో చిత్రంగా.. నితిన్‌తో తెర‌కెక్కించ‌నున్న‌ ‘శ్రీ‌నివాస‌ క‌ల్యాణం’ చేయాల‌ని దిల్ రాజు అడిగార‌ట‌. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న‌ ఈ సినిమాకి సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వహించబోతున్నారు. ఈ సినిమా క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న పాత్ర‌కి పెద్ద‌గా ప్రాముఖ్యం లేక‌పోవ‌డంతో సాయి ప‌ల్ల‌వి ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news