Gossipsస్పైడర్ నిర్మాత కి చరణ్ హామీ

స్పైడర్ నిర్మాత కి చరణ్ హామీ

ఈ సంవత్సరం మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహించారు. అయితే స్పైడర్ చిత్రం నిర్మాత ఎస్వి.ప్రసాద్ కు నష్టాలనే మిగిల్చిందని సమాచారం. అయితే మహేష్ తన రెమ్యూనరేషన్ లో కొంత వరకు తిరిగిచ్చేశారని, అయిన కూడా సర్దుబాటు కాకపోవటం తో నిర్మాత ఎస్ వి ప్రసాద్ మరో సినిమా ద్వారా ఆ నష్టాలను రికవర్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఇటీవలే ప్రసాద్ రామ్ చరణ్ ని కలిసి ఓ సినిమా చేద్దామని అడిగాడట. దానికి చరణ్ కూడా అంగీకరించినట్టు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నా వార్త.

ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నారు, ఇందులో కథానాయికగా సమంత నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రామ్ చరణ్.

ఆ తరువాత బోయపాటి శీను దర్శకత్వం లో ఓ సినిమా కమిట్ అయ్యాడట చరణ్. చరణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఎస్వీ ప్రసాద్ తో చేయబోయే సినిమా ఎప్పుడు మొదలు కానుందో వచ్చే సంవత్సరం ప్రథమార్ధం లో కానీ క్లారిటీ వచ్చే లాగా లేదు.గతంలో ఎస్వీ ప్రసాద్ గీత ఆర్ట్స్ తో కలిసి రామ్ చరణ్ తో ‘ధ్రువ’ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కృతజ్ఞత భావం తోనే  చరణ్ ఎన్వీ ప్రసాదుకు ఓ సినిమా చేస్తానని మాటిచ్చినట్టు సమాచారం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news