Newsరాజమౌళి తో సినిమా గురించి చరణ్.. అదంతా రూమరే అట..!

రాజమౌళి తో సినిమా గురించి చరణ్.. అదంతా రూమరే అట..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏంటా అని అందరు అనుకుంటుంటే మెగా నందమూరి కాంబినేషన్ కు నాంధి పలికాడు దర్శకధీరుడు. ఎనౌన్స్ మెంట్ రోజే ట్రిపుల్ ఆర్ అంటూ సంచలనం సృష్టించిన జక్కన్న సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.

సినిమా అంతా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో వస్తుందని.. ఎన్.టి.ఆర్, రాం చరణ్ అనందమ్ములుగా నటిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇంతకుముందు రంగస్థలం ప్రమోషన్స్ లో సినిమా గురించి తనకేమి తెలియదన్న రాం చరణ్ ఇప్పుడు సినిమాపై వస్తున్న రూమర్స్ అన్నిటిని చెక్ పెడుతూ ట్రిపుల్ ఆర్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా కాదని.. అందుకే ఎన్.టి.ఆర్ తాను అన్నదమ్ములుగా నతించట్లేదని అన్నాడు.

అంతేకాదు ట్రిపుల్ ఆర్ పై వస్తున్న ప్రతి వార్త అవాస్తమని చెప్పారు. అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ కానుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కనుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news