Gossipsరాజవంశానికి దత్తతగా వెళ్ళబోతున్న రామ్ చరణ్..

రాజవంశానికి దత్తతగా వెళ్ళబోతున్న రామ్ చరణ్..

జయజానకి నాయక తో బోయపాటి శీను స్పీడ్ కి కాస్త బ్రేక్ పడడంతో… మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే తీరాలి అనే కసితో ఉన్నాడు బోయపాటి . జూనియర్ ఎన్టీఆర్ తో గతంలో తాను తీసిన దమ్ము అంచనాలు అందుకోలేక ఎలా విఫలమయ్యింది అనేది మనసులో ఉంచుకుని ఈ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
కేవలం భారీతనం, యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాలు లాగిస్తున్నాడు అనే కామెంట్ నేపధ్యంలో చరణ్ మూవీలో సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ కు ఎక్కువ చోటు కల్పించబోతున్నాడు అని తెలుస్తోంది

చెర్రీ నటిస్తున్నరంగస్థలం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక నెల రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ట్రైలర్ లేదా టీజర్ ని అజ్ఞాతవాసి తో పాటు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని తర్వాత చరణ్ బోయపాటి శీను దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది జనవరి మూడో వారం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ షెడ్యూల్ రాజస్తాన్ లో ప్లాన్ చేసారు.

బోయపాటి శీను కథలో చరణ్ రాజ వంశీయుడిగా కనిపిస్తాడట. సినిమా ఎక్కువ భాగం కోటల్లోనే తీసేందుకు బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. పైగా రెండు షేడ్స్ ఉన్న పాత్ర చరణ్ చేయబోతు ఉండటం అసలు ఆకర్షణ అని తెలుస్తోంది. మరి అది డ్యూయల్ రోలా లేక ఫ్లాష్ బ్యాక్ లో ఒక పాత్ర వర్తమానంలో ఒక పాత్ర అనేది మాత్రం ఇంకా తెలియలేదు. బహుశా కొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news