Gossipsమెగా నందమూరి మల్టీస్టారర్ లో అక్కినేని వారి కోడలు .. రాజమౌళి...

మెగా నందమూరి మల్టీస్టారర్ లో అక్కినేని వారి కోడలు .. రాజమౌళి అదిరిపోయే స్కెచ్..!

బాహుబలి తర్వాత ఆ సినిమా రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా మెగా నందమూరి మల్టీస్టారర్ కు షురూ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రభాస్, రానాలు కలిసి బాహుబలి చేయగా ఇప్పుడు ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. అయితే ఇందులో హీరోలిద్దరు సమాన భాగస్వామ్యంగా ఉంటారని తెలుస్తుంది. విలన్ మాత్రం మరో హీరో ఉంటారట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా, రకుల్ పేర్లు వినిపించగా లేటెస్ట్ గా ఈ క్రేజీ మల్టీస్టారర్ లో సమంత నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలను చేస్తున్న సమంత ప్రస్తుతం తెలుగులో రంగస్థలం కన్నడ హిట్ మూవీ యూటర్న్ సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇదే కాకుండా రాజమౌళి సినిమా కూడా ఓకే అనేసిందని టాక్.

రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈగ మూవీలో సమంత నటించింది. నాని, సమంత జోడిగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో సమంత ఫైనల్ అయితే రాం చరణ్ సరసన సమంత నటిస్తుందని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news