Gossipsపాక్ మీడియాకు షాక్ ఇచ్చిన రాజమౌళి సమాధానం..!

పాక్ మీడియాకు షాక్ ఇచ్చిన రాజమౌళి సమాధానం..!

బాహుబలి సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు.. ఈ సినిమా కలక్షన్స్ లో చరిత్రలో మిగిలిపోయేలా చేసిన బాహుబలి సినిమా వసూళ్లే కాదు అంతకంత క్రేజ్ కూడా తీసుకొచ్చాయి. ఎక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినా సరే బాహుబలి యూనిట్ కు ఇన్విటేషన్ వస్తుంది. అలానే కరాచిలో జరిగే పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానం అందుకున్నాడు రాజమౌళి. ఆ విషయాన్నే చెబుతూ ఎక్సైటింగ్ గా ట్వీట్ చేశాడు.

ఇక రీసెంట్ గా ఆ కార్యక్రమం ముగించేసుకున్నాడు జక్కన్న. అయితే అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడట. సినిమా గురించి అంతా మాట్లాడిన రాజమౌళి అక్కడ మీడియా అత్యుత్సాహంతో పాకిస్థాన్ మీద మీ ఒపినియన్ ఏంటని అడిగితే.. చిన్నప్పటి నుండి పాకిస్థాన్ మాకు ఎనిమీస్.. శత్రువులుగా చూసేవాళ్లం. మా మొదటి శత్రువు వసీం అక్రం. కాని పెద్దయ్యాక మార్పు వచ్చింది. అందరు ఒకే రకమైన మనుషులం అంటూ చాలా క్లవర్ గా మాట్లాడాడు రాజమౌళి.

రాజమౌళి మాటలకి పాకిస్థాన్ ఆడియెన్స్ క్లాప్స్ కూడా కొట్టారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఏదైనా అక్కడకెల్లి మీరు మా ఎనిమీస్ అని చెప్పే ధైర్యం కేవలం రాజమౌళికే ఉందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news