Gossips"జై సింహా" ట్రైలర్ పై ప్రభాస్ అసంతృప్తి..!

“జై సింహా” ట్రైలర్ పై ప్రభాస్ అసంతృప్తి..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జై సింహా. కొద్దిపాటి గ్యాప్ తర్వాత బాలయ్య మార్క్ మాస్ మసాలా మూవీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా ట్రైలర్ పై తన అసంతృప్తిని తెలిపాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జై సింహా ట్రైలర్ లో బాలయ్యను చూసి త్రిల్ ఫీల్ అయ్యానని.. ఆ త్రిల్ ఫీల్ అయ్యే లోపే ట్రైలర్ పూర్తవడం తనకు నచ్చలేదని అన్నాడట ప్రభాస్.

ప్రభాస్ చేసిన కామెంట్స్ పాజిటివ్ గానే ఉన్నా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ కామెంట్స్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక జై సింహా ట్రైలర్ తో మరోసారి యువ హీరోలకు తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నాడు బాలయ్య. అందుకే సంవత్సరానికి ఒక సినిమాతో కాకుండా యువ హీరోలతో పోటీగా రెండు మూడు సినిమాలతో అలరిస్తున్నాడు.

జై సింహా సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు. బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు. జనవరి 12న రిలీజ్ అవుతున్న జై సింహా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో క్రేజీ మూవీగా వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news