Gossipsప్రభాస్- చెర్రీ కలిసి కొత్త బిజినెస్.. ఎంత వరకు నిజం...?

ప్రభాస్- చెర్రీ కలిసి కొత్త బిజినెస్.. ఎంత వరకు నిజం…?

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ సినిమాలు జోరందుకున్నాయి. ఏ కొత్త సినిమా ప్రారంభం అయినా అది మల్టీ స్టార్ మూవీ నా అని అందరూ చర్చించుకునే రేంజ్ లో కి వెళ్ళిపోయింది. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ – తారక్ లు కలిసి మల్టీ స్టార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ప్రభాస్ – చేరిలు కలిసి ఓ ప్రాజెక్ట్ చేపట్టారు.

టాలీవుడ్లో ప్రస్తుతం సెలెబ్రెటీలు అంతా సినిమాల్లో సంపాదించిన డబ్బుని వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కొత్త బిజినెస్ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా ప్రభాస్, రామ్ చరణ్‌లు కలిసి వ్యాపారం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్‌కు ఎప్పటి నుంచో ఓ మల్టీప్లెక్స్ నిర్మించాలనే కోరిక. ఈ మేరకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఓ స్థలం కూడా కొనుక్కుని ఉంచుకున్నారు. అయితే రామ్ చరణ్‌తో కలిసి ఈ వ్యాపారం చేయాలనేది ప్రభాస్ ప్లాన్.

ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించి యూవీ క్రియేషన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాణ సంస్థగా మంచి పేరులో ఉంది.తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్లను.. ఇద్దరూ కలిసి నడిపించబోతున్నారు అన్నమాట. పనిలో పనిగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మల్టీ స్టార్ మూవీ కూడా వచ్చేస్తే బాగుంటుందేమో కదా ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news