Gossipsఈ ఇద్ద‌రితో ఆ భామ ఆటా పాట 

ఈ ఇద్ద‌రితో ఆ భామ ఆటా పాట 

ఒక దెబ్బ‌కి రెండు పిట్ట‌లు

ముత‌క సామెత

అదే డ‌బుల్ ధ‌మాకా అన్నారనుకోండి వెరీ అల్రామోడ్ర‌న్ గా ఉంటుంది క‌దూ!

ఏదైతేనేం పూజా హెగ్డే అదృష్ట‌మే అదృష్టం..

అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన, ఇటు వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ సరసన హీరోయిన్‎గా నటించే అవకాశం కొట్టేసిందని తెలుస్తోంది.ఇటీవల ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడి హిట్ సొంతంచేసుకుంది ఈ సుంద‌రి ఈ వార్త విని ఎగిరి గంతేస్తోంది.త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‎తో ఆయన 25వ సినిమా షూటింగ్‎లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే ఎన్టీఆర్‎తో మరో సినిమా చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. మరోపక్క వంశీ పైడిపెల్లి మహేష్‎తో ఆయన 25వ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ రెండు సినిమాలు అతిత్వరలో సెట్స్ మీదకు రానున్నాయి.ఈ రెండు సినిమాల్లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్‎గా తీసుకుంటున్నారనేది టాలీ వుడ్ వర్గాల సమాచారం. ఇక వీటికి సంబందించి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌డ‌మే త‌రువాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news