Gossipsఇది పవన్ వల్లే సాధ్యమయ్యింది.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పవర్ స్టార్..!

ఇది పవన్ వల్లే సాధ్యమయ్యింది.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే పవన్ కొత్త సినిమా అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఇంకా టైటిల్ పెట్టలేదు కాని బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో చేసేస్తుంది.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తున్న పవర్ స్టార్ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ లో కూడా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ త్రివిక్రం మూవీ శాటిలైట్ రైట్స్ జెమిని టివి వారు 19.5 కోట్లను కొన్నారని టాక్. బాహుబలి తర్వాత ఈ రేంజ్ లో శాటిలైట్ సాధించిన సినిమాగా ఇండస్ట్రీని షేక్ చేసే రికార్డ్ సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

కేవలం పవన్ స్టామినాతోనే ఇది సాధ్యమయ్యిందని అంటున్నారు. జల్సా తర్వాత అత్తారింటికి దారేది సినిమా స్మాల్ స్క్రీన్ మీద కూడా మంచి హిట్ సాధించింది. అందుకే జెమిని టివి ప్రత్యేకంగా ఈ సినిమా కోసం పెద్ద మొత్తాన్ని పెట్టేసింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటగా ఈ అంచనాలకు తగ్గట్టు సినిమా వస్తే మాత్రం పవర్ స్టార్ మరోసారి హాట్ న్యూస్ గా మారే అవకాశం ఉంది. అఆ తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news