Newsపవన్ సభకు కాకినాడ ముస్తాబు

పవన్ సభకు కాకినాడ ముస్తాబు

ఈనెల 9న పవన్ సభకు కాకినాడ ముస్తాబవుతోంది. బీజేపీ రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన కాకనాడ నుంచే జిల్లాల యాత్ర మొదలుపెడతానని తిరుపతి సభలో ప్రకటించారు పవన్. ఈ మీటింగ్ కోసం కాకినాడలో భూమి పూజ కూడా జరిగింది. జనసేన కోశాధికారి రాఘవయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మీటింగ్ కు సీమాంధ్రుల ఆత్మగౌరవ సభగా నామకరణం చేశారు. తిరుపతి సభలో కేంద్రాన్ని టార్గెట్ చేసిన పవన్ కాకినాడ మీటింగ్ లో ఏం మాట్లాడతారన్నదానిపై అప్పుడే పార్టీల్లో ఆసక్తి కనబడుతోంది. తిరుపతి సభలో ఇప్పటికే ప్రత్యేక హోదాపై పవన్ అల్టిమేటం ఇచ్చారు. మరి కాకినాడలో కూడా దీనిపైనే మాట్లాడతారా.. లేదా అన్నది అందరిలోనూ ఆసక్తిగా ఉంది. అయితే మీటింగ్ కు సీమాంధ్రుల ఆత్మగౌరవ సభగా నామకరణం చేయడంతో.. ప్రత్యేకహోదాపైనే మాట్లాడతారని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే తిరుపతి సభలో దీనిపై మాట్లాడారు. మరి కాకినాడలో హోదాపై కొత్తగా మాట్లాడ్డానికేముంటుందనేది చర్చ.

కాపు రిజర్వనేషన్లపై మాట్లాడే పరిస్థితి కనబడ్డంలేదు. తనకు కులం, మతం అంటగట్టొద్దని పవన్ ఇప్పటికే చెప్పారు. మరి కొత్త సబ్జెక్ట్ లేకుండా పవన్ ఏం మాట్లాడతారో చూడాలి. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మీటింగ్ కు భారీగా తరలివెళ్లేందుకు అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు.

pavan

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news