Moviesఅఫీషియల్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘మెగా’ మల్టీస్టారర్.. రికార్డులు దద్దరిల్లాల్సిందే!

అఫీషియల్ : త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘మెగా’ మల్టీస్టారర్.. రికార్డులు దద్దరిల్లాల్సిందే!

T Subbirami Reddy to Produce MegaStar Chiranjeevi, Pawan Kalyan’s multistarrer project under Trivikram Direction.

అవును.. మీరు చదువుతున్న టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. స్టోరీలైన్ ఏంటి? మిగతా నటీనటులు ఎవరన్న విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు కానీ.. వీరి కాంబో సెట్ అయినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ, నిర్మాత కూడా అయిన టీ సుబ్బిరామిరెడ్డి నిర్మిస్తున్నారు. మొత్తానికి.. ఆమధ్య ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను చిరు, పవన్‌లతో ఓ సినిమా చేస్తానని ప్రకటించినట్లుగానే టీఎస్సార్ మెగా ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టేశారన్నమాట.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఖైదీ నెంబర్ 150లో చిరంజీవిని చూశాక నిర్మాణ రంగంలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి, సినిమాల్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. తొలుత చిరు, పవన్‌లతో కలిసి చర్చలు జరిపాను. వాళ్లిద్దరూ మూవీ చేసేందుకు ఓకే చెప్పారు. ఇక ఈ మెగా మల్టీస్టారర్‌ని త్రివిక్రమ్ బాగా హ్యాండిల్ చేస్తాడనుకుని, ఆయన్ను సంప్రదించాను. త్రివిక్రమ్ తక్షణమే ఓకే అనేశారు. ఈరోజు (02-02-2017) త్రివిక్రమ్‌తో మరోసారి చర్చలు జరిపి.. సినిమాని ఫైనల్ చేశాము. ఈ మెగా మూవీని నిర్మిస్తున్నానని ప్రకటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతోపాటు అశ్వినీదత్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

సాధారణంగా తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రావడం చాలా అరుదు. ఒకవేళ వస్తే మాత్రం.. దానిపై అంచనాలు మామూలుగా ఉండవు. అలాంటిది.. ఒకరు మెగాస్టార్, మరొకరు పవర్‌స్టార్, ఇంకొకరు మాటల మాంత్రికుడు.. ఈ ముగ్గురు కలిస్తే ఏమైనా ఉంటుందా? బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. రికార్డుల మోత మోగిపోవాల్సిందే. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుందనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. చిరు ఆల్రెడీ తన రెండు ప్రాజెక్టుల్ని వెల్లడించేశారు. మరోవైపు.. త్రివిక్రమ్ త్వరలోనే పవన్‌తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో ఓ మూవీ కూడా ఓకే అయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా ‘కాటమరాయుడు’ తర్వాత మరో రెండు చిత్రాల్ని లైన్‌లో పెట్టాడు.

ఇలా ముగ్గురూ రెండేసి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ఈ లెక్కన.. ఈ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ ఈ సంవత్సరంలో ఉండదు. వచ్చే ఏడాదిలోనే సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే.. ఈ సినిమా కోసం చాలాకాలం వెయిట్ చేయాల్సిందే. లవర్ ఓకే చెప్పినా.. ముద్దూ, ముచ్చటకోసం పెళ్ళి వరకు ఆగాల్సిందే! అన్నట్లుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news