Gossipsమరో సినిమాని లైన్ లో పెట్టిన పవన్..!

మరో సినిమాని లైన్ లో పెట్టిన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడని అప్పట్లో వచ్చిన రూమర్. అయితే కేవలం కామా మాత్రమే పెట్టాలని అనుకున్నాడని అన్నారు. 2019 ఎన్నికల టైంలో సినిమాలు చేయడం కుదరదు కాబట్టి పవన్ సినిమాలకు కొద్దిపాటి బ్రేక్ ఇవ్వక తప్పదు. 2018 సంక్రాంతికి అజ్ఞాతవాసి రిలీజ్ అవుతుండగా ఆ వెంటనే పవన్ మరో సినిమా లైన్ లో పెడుతున్నాడట.
అప్పుడెప్పుడో నీశన్ డైరక్షన్ లో పవన్ వేదాలం సినిమా రీమేక్ కు ముహుర్తం పెట్టారు. మళ్లీ ఆ తర్వాత ఆ సినిమా ఊసే ఎత్తలేదు కాని పవన్ ఆ రీమేక్ పై ఇంకా ఆశలు పెట్టుకున్నాడట. నీశన్ డైరక్షన్ లోనే ఆ సినిమా వస్తుందని తెలుస్తుంది. అజిత్, శృతి హాసన్ జంటగా నటించిన వేదాలం సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది.
అప్పట్లోనే ఆ సినిమా తెలుగు రీమేక్ పై వార్తలు రాగా పవన్ ఆ సినిమాకు ఓకే చెప్పడం జరిగింది. మరి జనవరి నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అంటున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news