Moviesఖమ్మం గడ్డ మీద పైసా వసూల్ ఆడియో.. చరిత్ర సృష్టించడానికేనా..!

ఖమ్మం గడ్డ మీద పైసా వసూల్ ఆడియో.. చరిత్ర సృష్టించడానికేనా..!

సినిమా ఫంక్షన్ అంటే కేవలం హైదరాబాద్, వైజాగ్ లేదా విజయవాడ అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడ ఏం చేసినా అదో సంచలనం అవుతుంది. పలానా చోట చేస్తేనే జనాలకు రీచ్ అవుతుంది అన్నది లేదు. అందుకే ఆడియో రిలీజ్ కు ఒక లొకేషన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మరో లొకేషన్ ఇలా అన్ని చోట్ల ఫ్యాన్స్ ను కవర్ చేస్తున్నారన్నమాట. ఇక ఈ మ్యాటర్ అంతా దేనికి అంటే పూరి జగన్నాధ్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ ఆడియో సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా ఆడియో ఆగష్టు 17న ఖమ్మంలో రిలీజ్ చేస్తున్నారు. ఖమ్మం సిటీలోని ఎస్.ఆర్ & బి.జి.ఎన్.ఆర్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ ఆడియో రిలీజ్ అవబోతుంది.

ఖమ్మంలో రిలీజ్ చేసుకుంటున్న స్టార్ హీరో ఆడియోగా చరిత్ర సృష్టిస్తుంది పైసా వసూల్. ముఖ్యంగా ఈ ఆడియో ఖమ్మంలో జరుపడానికి కారణం సినిమా నిర్మాత భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనంద్ ప్రసాద్ ఖమ్మం వాడే. ఆల్రెడీ సౌఖ్యం సినిమా టైంలోనే తన తర్వాత సినిమా ఆడియోని ఖమ్మంలో రిలీజ్ చేస్తా అని చెప్పాడు. రీసెంట్ గా వచ్చిన శమంతకమణి ఆడియో హైదరాబాద్ లోనే కానిచ్చేసి బాలయ్యతో చేసే పైసా వసూల్ ఆడియో మాత్రం ఖమ్మంలో పెట్టారు. ఇక ఖమ్మం విషయానికొస్తే ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఖిల్లాకో చరిత్ర ఉంది. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఖమ్మంలో ఈ ఆడియో రిలీజ్ అవుతుండటం గొప్ప విషయమని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news