Gossipsమాంత్రికుడి రాజకీయ బాటలో తారక్ డేరింగ్ స్టెప్.. వివాదాస్పదం అవుతుందా ??

మాంత్రికుడి రాజకీయ బాటలో తారక్ డేరింగ్ స్టెప్.. వివాదాస్పదం అవుతుందా ??

‘టెంపర్’ చిత్రం నుంచి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. తన కెరీర్‌కి, పర్సనల్ లైఫ్‌కి ఏమాత్రం ప్రభావం చూపని బాటలో అడుగులు వేస్తున్నాడు. ఆ కేర్ తీసుకోవడం వల్లే ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాడు. ఇక తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ సినిమా కూడా ఓ డిఫరెంట్ స్టోరీలైన్‌తో రూపొందుతోంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వస్తున్న తారక్.. ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

ప్రస్తుతం ‘జై లవ కుశ’ సినిమా చేస్తున్న తారక్.. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం అందరికీ తెలుసు. ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లడానికి చాలా సమయం వుంది కానీ.. ఆలోపే ఓ షాకింగ్ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వుండబోతోందని సమాచారం. ఒకవేళ ఇది వాస్తవం అయితే.. తారక్ నిజంగానే డేరింగ్ స్టెప్ వేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే.. ఇలాంటి జానర్ అతడు గతంలో చేయలేదు. పైగా.. చాలాకాలం నుంచి ఇతను టిడిపి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. కాబట్టి.. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా చేయడం విశేషమే.

అయితే.. ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుత పార్టీలపై సెటైర్లు వేయకుండా కేర్ తీసుకోవాలి. అంటే.. ప్రతీ సిన్ విషయంలోనూ జాగ్రత్తగా వుండాలన్నలన్నమాట. ముఖ్యంగా.. అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకంగా డైలాగ్స్ లేకుండా చూడాలి. అలాకాకుండా ఒక్క సెటైర్ వేసినా.. కచ్చితంగా అది వివాదానికి తెరతీస్తుంది. పైగా.. ఎన్నికల వేడి ఆరంభమయ్యే సమయంలో అంటే 2018 సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది కాబట్టి.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలి. మరి.. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news