Gossipsఎన్టీఆర్, పవన్ మళ్ళి కలవనున్నారు ... వేదిక ఏదో...

ఎన్టీఆర్, పవన్ మళ్ళి కలవనున్నారు … వేదిక ఏదో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా ఆడియో ఈ నెల 19న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఆడియో వేడుకకి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తాడని తెలుస్తుండగా ఇప్పుడు ఓ కొత్త న్యూస్ చెక్కర్లు కొడుతుంది. అజ్ఞాతవాసి ఆడియోకి సర్ ప్రైజ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పటికే మెగా నందమూరి కాంబినేషన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ వస్తుండగా ఇప్పుడు పవర్ స్టార్ ఆడియోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తే ఆ హంగామా వేరేలా ఉంటుంది. త్రివిక్రం తర్వాత ఎన్.టి.ఆర్ సినిమానే చేస్తున్నాడు. ఆ సినిమా ముహుర్త కార్యక్రమానికి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు పవన్ ఆడియోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు.

ఇదే జరిగితే మెగా నందమూరి హీరోల మధ్య సత్సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అసలు అజ్ఞాతవాసి ఆడియో ఈవెంట్ కు ఎవరు గెస్టుగా వస్తారు అన్నది మరో మూడు రోజుల్లో తెలుస్తుంది. సంక్రాంతి బరిలో దిగుతున్న అజ్ఞాతవాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news