Moviesతారక్ 27వ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్..

తారక్ 27వ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్..

Actor and Producer Kalyan Ram revealed an interesting news about NTR’s 27th project which is to be directed by Bobby.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో తొలిసారి తారక్ చేస్తున్న మూవీ కాబట్టి.. అన్నీ తానై చూసుకుంటున్నాడు నిర్మాత కళ్యాణ్ రామ్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి వెలువడిన అఫీషియల్ వార్తేమిటో తెలిస్తే.. ఈ చిత్రాన్ని కళ్యాణ్ ఎంత స్పెషల్‌గా రూపొందిస్తున్నాడో అర్థం అవుతుంది.

ఇంతకీ ఆ వార్తేమిటి అనుకుంటున్నారా! మరేదో కాదు.. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సీకె మురళీధరన్‌ని కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు. అసలు అతనెవరు? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌కు అద్భుత విజయాలు అందించిన ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ మూవీలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేశాడు. ఆయన తన టాలెంట్‌తో జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు. ఆయనే.. ఎన్టీఆర్ మూవీకి కెమెరామన్‌గా వ్యవహరించనున్నాడు. తెలుగులో మురళీధరన్‌ని ఇదే తొలి సినిమా. తన ప్రతిభ ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్న ఈయన.. ఈ సినిమాకి కళ్లు చెదిరే విజువల్స్ అందిస్తాడని చెప్పుకుంటున్నారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో తారక్ తొలిసారిగా మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news