Gossipsఎన్టీఆర్ అభిమానులకి అదిరిపోయే వార్త ... మహానటి ని మించి..

ఎన్టీఆర్ అభిమానులకి అదిరిపోయే వార్త … మహానటి ని మించి..

నందమూరి బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఓపెనింగ్ గ్రాండ్ గా చేసినా ఆ తర్వాత షూటింగ్ నెమ్మదించింది. తేజ డైరక్షన్ లో రావాల్సి ఉన్న ఎన్.టి.ఆర్ బయోపిక్ బాబోయ్ నా వల్ల కాదంటూ ఆయన చెతులెత్తేశాడు. ఇక ఎవరెవరో డైరక్టర్ల పేర్లు వినిపించగా ఫైనల్ గా క్రిష్ చేతుల్లోకి ఎన్.టి.ఆర్ బయోపిక్ వచ్చిందని టాక్.

బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ డైరక్షన్ లోనే వచ్చింది. ఆ సినిమా టైంలో క్రిష్ ప్రతిభను గుర్తించిన బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ ను అతని చేతుల్లో పెడుతున్నాడట. తేజ వెళ్లాక చంద్ర సిద్ధార్థ్ ను అనుకోగా అది కుదరలేదు. ఏకంగా తానే డైరెక్ట్ చేద్దామన్న ఆలోచన రాగా సన్నిహితులు చెప్పడంతో వెనక్కి తగ్గాడు బాలకృష్ణ.

ఇక ఫైనల్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ డైరక్షన్ లో రాబోతుంది. ఈ విషయం అఫిషియల్ గా చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రిష్ కంగనా రనౌత్ లీడ్ రోల్ గా మణికర్ణిక సినిమా చేస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మి భాయ్ బయోపిక్ గా ఆ సినిమా తెరకెక్కుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news