Moviesసావిత్రి చివరిరోజుల్లో ఎన్టీఆర్.. ఏఎన్నార్ లు.. ఏమి చేశారో తెలిస్తే మీ...

సావిత్రి చివరిరోజుల్లో ఎన్టీఆర్.. ఏఎన్నార్ లు.. ఏమి చేశారో తెలిస్తే మీ కళ్ళ వెంట నీళ్లు ఆగవు

మహానటి సావిత్రి జీవిత కథ చూసిన వారంతా బరువెక్కిన హృదయాలతో థియేటర్ల నుండి వస్తున్నారు. ఆమె చివరి రోజుల్లో ఎంత దీనస్థితిలో ఉన్నారో చూపించారు. అయితే మహానటి అభినయ తార ఆ దుస్థితిలో ఉన్నప్పుడు మిగతా స్టార్స్ ఎందుకు ఆమెకు అండగా నిలవలేదు అన్నది చర్చలకు దారి తీస్తుంది.

ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లాంటి స్టార్స్ తో సైతం ఆమె గొప్ప గొప్ప సినిమాలు చేసింది. అంతేకాదు ఆమె దర్శ నిర్మాతలకు మంచి సహకారం అందించింది. ఆమె నటిగానే కాదు మంచి మనిషిగా ప్రజాదరణ పొందింది. మరి అలాంటి మహానటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు ఆమెను ఆదుకోలేదని అంటున్నారు. అయితే ఇదే విషయాన్ని సినిమాలో సావిత్రి స్నేహితురాలు సుశీలతో చెప్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

మధురవాణి దగ్గరకు ఆమె వచ్చి మాట్లాడిన సందర్భంలో ఎందుకు ఆమెని ఆదుకోలేదని అంటే ఆమె ఎవరికైనా సాయం చేయడమే కాని సహాయం అడగదని చెబుతుంది. అలానే అప్పట్లో కూడా ఆమె మరి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టు ఎవరికి తెలియనివ్వలేదట. ఆత్మాభిమానం ఉన్న మనిషి కాబట్టి ఎవరు ముందు చేయి చాచాలని అనుకోలేదు. అందుకే ఆమెకు ఎవరు సాయం చేయలేకపోయారు. అభిమానిగా వచ్చి ఆమెని మోసం చేసిన ఓ పాత్ర వల్ల మనుషులన్నా ఆమెకు నమ్మకం లేకుండా పోయిందని కూడా చూపించాడు దర్శకుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news