Gossipsఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?

ఆ ఐదుగురిపై కన్నేసిన ఎన్టీఆర్.. ఎవరికి పచ్చజెండా ఊపుతాడో?

According to latest sources, NTR-Bobby movie unit has shortlised five heroines to select for ntr’s three characters in his 27th film which is going to floors from next month.

ఎప్పుడైతే ఎన్టీఆర్ తన రూటు మార్చాడో.. అప్పటినుంచి చాలా జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్‌లోనే 27వ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. అన్నీ తానై చూసుకుంటున్నాడు. ‘గ్యారేజ్’ తర్వాత తదుపరి చిత్రం ఎవరితో చేయాలి? అనే దానిపై నిర్ణయం తీసుకోవడం కోసమే మూడు నెలలపాటు గ్యాప్ తీసుకున్నాడంటే.. తారక్ 27వ ప్రాజెక్ట్‌ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కథల ఎంపిక విషయంలోనే కాదు.. దర్శకుడు, టెక్నీషియన్స్‌తోపాటు కథానాయికలను సెలెక్ట్ చేయడంలోనూ కేర్ తీసుకుంటున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తన సరసన నటించే ముగ్గురు హీరోయిన్ల కోసం తారక్ ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

అదేంటి..? ఇదివరకే ముగ్గురు హీరోయిన్లను ఫిక్స్ చేసినట్లుగా వార్తలొచ్చాయి కదా..? మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? అని అనుకుంటున్నారా! గతంలో వచ్చిన ఆ వార్తలు కేవలం రూమర్లు మాత్రమే. వాటిని స్వయంగా కళ్యాణ్ ఖండించాడు కూడా. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న సినిమాలోని ఆయా క్యారెక్టర్లకు జోడీలు సెట్ అవ్వలేదని.. ఇంకా వెతుకుతున్నామని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కొందరిని పరిశీలించిన ఈ మూవీ యూనిట్.. ఓ షార్ట్ లిస్ట్‌ని రెడీ చేసిందట. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, రాశి ఖన్నా, నివేదా థామస్, కాజల్ అగర్వాల్.. ఈ ఐదుగురినీ కన్సిడరేషన్లో ఉంచినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఐదుగురిని అన్ని రకాలుగా పరిశీలించి.. ముగ్గురిని ఎంచుకుంటారని తెలుస్తోంది. తారక్, కళ్యాణ్, డైరెక్టర్ బాబీ.. ఆ విషయమై చర్చలు జరుపుతున్నారట.

తొలుత ఈ సినిమాలో రకుల్ ప్రీత్, శృతిహాసన్‌లను తీసుకోవాలని భావించారట. కానీ.. డేట్ల సమస్య వల్ల వారు అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే కొందరిని పరిశీలించి.. ఆ ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. మరి.. వారిలో ఎన్టీఆర్‌కి జోడీ కట్టబోయే ముగ్గురు భామలు ఎవరో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news