Gossipsనాని నెక్స్ట్ ఆ డైరెక్టర్ తోనే !

నాని నెక్స్ట్ ఆ డైరెక్టర్ తోనే !

ఒక సినిమా పూర్త‌వ్వ‌కుండానే మ‌రో సినిమా ఇలా వ‌రుస సినిమాలు క‌మెట్ అవుతున్నాడు నాని. డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌ను ఎప్పుడో క్రాస్ చేసిన ఈ హీరో తాజాగా‘నిన్నుకోరి’ మూవీతో మరో హిట్‌ కొట్టి టాలీవుడ్ టాప్ హీరో రేంజ్‌కు వచ్చేశాడు. ఈ మూవీ రిలీజ్‌కు ముందే వేణు శ్రీరామ్ ‘ఎంసీఏ’, మేర్లపాక గాంధీ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలను లైన్‌లో పెట్టగా.. ఎంసీఏ విడుదలకు సిద్ధమౌతోంది.ఈ సినిమా లు షూటింగ్ దశలో ఉండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌‌పై పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

 

రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉన్నది ఒకటే జిందగీ’ మూవీ డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించిన కిషోర్ తిరుమల ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ తర్వాత కిషోర్-నాని కాంబినేషన్‌లో ఓ మూవీ ఉండబోతున్నట్టు సమాచారం. నిర్మాత ఎవ‌ర‌న్న‌ది తెలియ‌రాకున్నా నాని ఈ సినిమా చేయ‌డం మాత్రం ప‌క్కా అని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news