Newsఫ్యాన్స్‌కి అద్భుతమైన పరిణామం.. తారక్ బైక్ డబ్బులు తీసుకున్న బాలయ్య!!

ఫ్యాన్స్‌కి అద్భుతమైన పరిణామం.. తారక్ బైక్ డబ్బులు తీసుకున్న బాలయ్య!!

బాబాయి-అబ్బాయిలైన బాలయ్య, తారక్‌ల మధ్య రిలేషన్ మునుపటిలా అన్యోన్యంగా లేదన్న విషయం అందరికీ తెలుసు. ఒకప్పుడు పాలు-నీళ్లలా కలిసి వున్న వీరి మధ్య ఏం చెడిందో తెలీదు కానీ.. చాలాకాలం నుంచి వారి బంధం సఖ్యతగా లేదు. అసలు వీరిద్దరూ ఇలా విడిపోవడానికి గల కారణాలేంటని స్వయంగా తారక్‌ని మీడియావాళ్ళు ఎన్నోసార్లు ప్రశ్నిస్తే.. తమ మధ్య ఏ గొడవలు లేవంటూ ఒకే జవాబిస్తూ వచ్చాడు. మరి.. ఒకే ఫ్రేములో ఎందుకు కనిపించట్లేదనే ప్రశ్నకి మాత్రం క్లారిటీ లేదు. ఓవైపు ఫ్యాన్స్ కూడా వీరి కలయిక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కానీ.. అలాంటివేం జరగలేదు.

కానీ.. గతకొన్నాళ్ళ నుంచి ఎవరూ ఊహించని ట్విస్టులు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి ఇస్తున్నారు ఈ బాబాయి-అబ్బాయిలు. ఆమధ్య ‘శాతకర్ణి’ టీజర్, ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడు తారక్ వెంటనే స్పందించాడు. ట్విటర్ వేదికగా బాబాయిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు.. క్రిష్‌తో కలిసి ఆ సినిమా చూసిన తర్వాత కూడా మనోడు పొగడ్తలు కురిపించాడు. అప్పుడు ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ సంతోషం రెట్టింపయ్యే చేసేలా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తారక్ నటించిన సినిమా యూనిట్ సభ్యులు విరాళంగా కొంత డబ్బు ఇస్తే.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా బాలయ్య తీసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.

‘జనతా గ్యారేజ్’లో తారక్ వాడిన బైక్‌ని సొంతం చేసుకోవడం కోసం ఫ్యాన్స్‌కి పోటీ నిర్వహించగా.. నిర్మాతలకు రూ.10 లక్షలు పోగయ్యాయి. ఆ మొత్తాన్ని బాలయ్య ఆధ్వర్యంలో నడిచే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా సినిమా నిర్మాతలు, దర్శకుడు కొరటాల శివ స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి.. ఆయన చెతికి చెక్కు అందించారు. ఇలా అబ్బాయ్ సినిమా యూనిట్ తరఫు నుంచి వచ్చిన డబ్బుల్ని బాబాయి ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా తీసుకోవడం నిజంగా విశేషం. ఇది నందమూరి ఫ్యాన్స్‌కి అద్భుతమైన దృశ్యం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news