Movies నేను అన్ని పాత్రలకు సరిపోను : ఆడియో...

నేను అన్ని పాత్రలకు సరిపోను : ఆడియో ఫంక్షన్ లో బాలయ్య సంచలనం

ఈ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా ఎంతో ఘనంగా జరిగిన బాలయ్య బాబు శత చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుక లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు , బాలయ్య బాబు ని ‘సింహ’ ‘లెజెండ్’ గా చూపించిన బోయపాటి శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ సభలో బాలయ్య బాబు మాట్లాడుతూ “నేను కూడా అన్ని పాత్రలకు సరిపోను.. నాకు సరిపోయే పాత్రలోనే నేను నా వంతు చేసుకుంటూ వెళుతున్నాను.. దానికి మీ అందరి ఆశీస్సులు లభించటం నా పూర్వ జన్మ సుకృతం” అని చెప్పటం కొంత షాకింగ్ గా ఉన్నప్పటికీ నిజంగా అభినందనీయం.. ఎందుకంటే ఇదే సభలో బాలయ్య బాబు చెప్పినట్లు ప్రతి ఆర్టిస్ట్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.. వాటిని తెలుసుకొని వారికి తగ్గట్లుగా పాత్రలు చేసుకుంటూ వెళితే అందరి అభిమానాలను పొందుతారు.

ఇక ఇదే సభలో చెప్పిన డైలాగ్ వింటే తెలుగు వారు ఎక్కడున్నా సరే ఎవరి రోమాలైనా నిక్కబొడుచుకోవలసిందే..ఆ డైలాగ్ మీకోసం “భారత దేశం ఉమ్మడి కుటుంబం , గదికి గదికి మధ్యన గోడలుంటాయ్ . ఈ ఇల్లు నాదంటే నాది అని కొట్టుకుంటాం , కానీ పరాయి దేశస్థుడు ఎవడో వచ్చి ఆక్రమించాలి అని ప్రయత్నిస్తే . ఎగరేసి నరుకుతాం .. సరిహద్దుల్లో మీకు స్మశానాలు నిర్మిస్తాం .. మీ మొండేల మీద మా జండా ఎగరేస్తాం ..”

GPSK-Dialogue
GPSK-Dialogue

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news