Moviesనాగ శౌర్య వర్సెస్ రవితేజ.. గెలిచింది ఎవరు..?

నాగ శౌర్య వర్సెస్ రవితేజ.. గెలిచింది ఎవరు..?

పాతికేళ్లుగా ఉన్న స్టార్ హీరోకు పోటీగా ఓ యువ హీరో వచ్చాడు. ఈ వారం బాక్సాఫీస్ ఫైట్ లో మాస్ రాజా రవితేజకు పోటీగా ఛలో అంటూ నాగ శౌర్య వచ్చాడు. విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడుతో రవితేజ.. వెంకీ కుడుముల డైరక్షన్ లో ఛలోతో నాగ శౌర్య. ఇలా ఇద్దరు ఒకే రోజు తమ లక్ టెస్ట్ చేసుకున్నారు.

ఈ పోటీలో గెలిచింది ఎవరు అంటే యువ హీరో నాగ శౌర్య అనే చెప్పాలి. ఛలో అంటూ సింపుల్ కథతో వచ్చిన నాగ శౌర్య సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు కావాల్సిన లవ్, ఫన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఛలో మంచి టాక్ తెచ్చుకుంది. కథ పరంగా పాతదే అనిపించినా కథనం నడిపించిన తీరు ఆడియెన్స్ కు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక లీడ్ పెయిర్ శౌర్య, రష్మికల జంట ఆకట్టుకుంది.

ఇక రవితేజ టచ్ చేసి చూడు మాత్రం వక్కంతం వంశీ పెన్ను నుండి వచ్చిన రొటీన్ కథ అని తేలింది. సినిమా కథ పాతదే అయినా కథనంలో కూడా రొటీన్ పంథా కనిపించింది. భారీ స్టార్ కాస్ట్ ఉన్నా ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో వచ్చిన టచ్ చేసి చూడు రవితేజ అభిమానులకే కాదు సిని ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది. సినిమా ప్రమోషన్స్ లో కూడా టచ్ చేసి చూడుని మించి ఛలో ఉంది. అందుకే ఛలోకే ప్రేక్షకులు ఓటేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news