Gossipsహాట్ టాపిక్ గా మారిన చైతూ సమంతల కొత్త వ్యూహం !

హాట్ టాపిక్ గా మారిన చైతూ సమంతల కొత్త వ్యూహం !

ఏమాయ చేసావే సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్య, సమంతలు నిజ జీవితంలో కూడా ప్రేమను పంచుకుంటున్నారు. ఈమధ్యనే ఒకటైన ఈ ఇద్దరు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా చైతు, సమంత కలిసి బిగ్ బజార్ కంపెనీ యాడ్ చేశారు. దానికి విపరీతమైన స్పందన రావడంతో కార్పోరేట్ కంపెనీల కన్ను ఈ కపుల్స్ మీద పడ్డది. పెళ్లైనా సరే సమంత క్రేజ్ అలానే ఉండటంతో చై, శ్యాం ల కాంబినేషన్ లో యాడ్స్ చేస్తున్నారు.

వీరి కాంబినేషన్ లో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ యాడ్ షూట్ చేశారు. ప్రస్తుతం ఆ యాడ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. పెళ్లైన సెలబ్రిటీస్ అంతా వాణిజ్య ప్రకటనలకు బాగా పనికొస్తున్నారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్-కాజోల్, సౌత్ లో స్నేహ-ప్రసన్న, జ్యోతిక-సూర్య ఇలా యాడ్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఈ క్రమంలో తెలుగులో క్రేజీ జంట అయిన చైతు, సమంతలు కూడా యాడ్స్ మొదలుపెట్టారు. చూస్తుంటే వీరిద్దరు మరిన్ని యాడ్స్ చేసి ట్రెండ్ సృష్టించేలా ఉన్నారు. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో బిజీగా ఉండగా.. సమంత కన్నడ సూపర్ హిట్ మూవీ యూటర్న్ రీమేక్ లో నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news