Gossipsఒక పువ్వు 23 మంది ప్రాణాలు తీసింది... అదేంటో తెలుసుకొని జాగ్రత్త...

ఒక పువ్వు 23 మంది ప్రాణాలు తీసింది… అదేంటో తెలుసుకొని జాగ్రత్త పడండి….!

ఇంతకీ ఈ ఘోరం ఎలా చోటు చేసుకుంది? అంతమంది ప్రాణాలు పోవటానికి కారణం ఏమిటి?  అన్న విషయంలోకి వెళితే.. ఒక బాధితురాలి చెప్పిన మాట వింటే షాక్  అవ్వాల్సిందే. మాటలో వచ్చిన చిన్న తేడా.. దాన్ని అర్థం చేసుకోవటంలో జరిగిన  పొరపాటుకు 23 నిండుప్రాణాలు బలి అయ్యాయంటే నమ్మక తప్పదు.

పువ్వులు (ఫూల్) పడిపోయాయి  అన్న మాటను పూల్ (వంతెన) పడిపోయిందని అర్థం చేసుకోవటం ఏర్పడిన గందరగోళం.. ఆపై చోటు చేసుకున్న తొక్కిసలాటకు కారణమైందన్న విషయాన్ని ఈ ఉదంతంలో ప్రాణాలతో బయటపడిన యువతి ఒకరు వెల్లడించారు. తొక్కిసలాట రోజు ఏం జరిగిందన్న విషయాన్ని వివరించిన ఒక యువతి.. బ్రిడ్జి పక్కనే ఉన్న పూలు అమ్ముకునే వ్యక్తి  పూలు పడిపోయాయి (ఫూల్ గిర్ గయా) అంటూ ఏడుస్తూ చెప్పిన మాటను.. అక్కడి వారు తప్పుగా పూల్ (వంతెన) గిర్ గయా అని అర్థం చేసుకోవటంతో.. ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు.

ఇదికాస్తా తొక్కిసలాటకు దారి తీసి భారీ ప్రాణనష్టానికి కారణమైంది. మాటలో దొర్లిన చిన్న తప్పు అంతమంది ప్రాణాలు పోయేలా చేసిందని చెప్పక తప్పదు.  ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించటం చూసినప్పుడు నోటి నుంచి వచ్చే మాటను  ఆచితూచి గా మాట్లాడాలనిపించక మానదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news