Moviesపంజా విసిరిన ‘పులి’.. పరుగు లంకించిన ‘బేతాళుడు’

పంజా విసిరిన ‘పులి’.. పరుగు లంకించిన ‘బేతాళుడు’

Vijay Antony’s latest movie Bethaludu collections are dropped at the boxoffice from the second day because of mixed reports, while Mohanlal’s Manyam Puli doing well in the second day also when compared to it’s first day run. Hence another time proved that positive talk will help movie to bring people to theatres. Finally Manyam Puli is the winner in this weekend boxoffice war.

ఓ సినిమా ఎన్ని అంచనాల మధ్య విడుదలైనా.. దానికి వచ్చే రెస్పాన్స్‌ని బట్టే జనాలు థియేటర్లకు వెళతారు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే.. దానికి బ్రహ్మరథం పడతారు. లేకపోతే.. ఆ సినిమావైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది.

విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ‘బేతాళుడు’ చిత్రం భారీ అంచనాల మధ్యే ఈ గురువారం (01-12-2016) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం ఫెయిల్ అయ్యింది. ఈ చిత్రంపై నెలకొన్న క్రేజ్ కారణంగా ముందుగానే బుకింగ్స్ అయిపోవడంతో తొలిరోజు మంచి వసూళ్లే (రూ.1.60 కోట్లు షేర్) రాబట్టింది కానీ.. ఆడియెన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. చాలా ఏరియాల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే వచ్చింది. దాంతో.. రెండో రోజు నుంచే కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయిపోయాయి. చాలా ఏరియాల్లో థియేటర్లు ఖాళీగా మిగిలిపోయాయని ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి.

‘బేతాళుడు’ తర్వాత శుక్రవారం (02-12-2016) విడుదలైన ‘మన్యంపులి’ మాత్రం రెండోరోజు కూడా బాక్సాఫీస్ వద్ద పంజా విసిరింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడం, కంటెంట్ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకోవడంతో.. థియేటర్లవైపు పరుగులు తీస్తున్నారు. దీంతో.. తొలిరోజు కంటే రెండోరోజే ఈ చిత్రానికి అత్యధిక వసూళ్లు వచ్చాయని ట్రేడ్ లెక్కలు పేర్కొంటున్నాయి. ఇది మాస్ కమర్షియల్ చిత్రం అయినప్పటికీ.. మల్టీప్లెక్కుల్లోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళుతోందని అంటున్నారు. అంటే.. ఈ వారం బాక్సాఫీస్ పోరులో మోహన్‌లాల్‌దే పైచేయి అన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news