Gossipsఎన్టీఆర్ తో మహేష్ ఫైట్.. ఊహలకు కూడా అందని రేంజ్..!

ఎన్టీఆర్ తో మహేష్ ఫైట్.. ఊహలకు కూడా అందని రేంజ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర్ ఫైట్ చేస్తే.. ఆ ఫైట్ ఎలా ఉంటుంది. ఈ దసరాకి ఇది తప్పేట్లు లేదు. సెప్టెంబర్ 21న జై లవకుశ రిలీజ్ పక్కా అంటుంటే ఓ వారం గ్యాప్ తో 27న మహేష్ స్పైడర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. బాబి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో జై లవకుశ చేస్తున్నాడు. సినిమా టీజర్ అంచనాలను పెంచేయగా కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డుల అంతు చూడడమే ధ్యేయం అన్నట్టు తారక్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక మురుగదాస్ తో మహేష్ చేస్తున్న అడ్వెంచర్స్ సినిమా స్పైడర్. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోయే ఈ సినిమా కూడా హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంటుందట. టీజర్ తో మహేష్ స్పైడర్ కూడా అంచనాలను పెంచేసింది. అయితే ఈ ఇయర్ రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలైన ఈ రెండు వారం రోజుల్లో రిలీజ్ అవడం బాక్సాఫీస్ కు దెబ్బే అంటున్నారు.

కనీసం ఒక సినిమాకు మరో సినిమాకు రెండు వారాలు గ్యాప్ ఉంటే తప్ప సినిమా బయటపడలేవు. జై ముందొస్తున్నా స్పైడర్ గా మహేష్ రిలీజ్ డేట్ సరిచేస్తే బెటర్ అని అంటున్నారు సిని పండితులు. కాదు కూడదు ఎవరి మార్కెట్ వారిదే ఎవరి కలక్షన్స్ వారివే అనుకుంటే కచ్చితంగా ఈ ఫైట్ ఊహలకు అందని రేంజ్ లో ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. దసరా బరిలో పండుగకు ముందు పండుగ తర్వాత ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఎన్.టి.ఆర్, మహేష్ లు ఏ రేంజ్ లో హిట్ అందుకుంటారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news