Gossipsదిమ్మతిరిగే ట్విస్ట్ : రాజకీయాల్లోకి మహేష్ బాబు ఎంట్రీ..!

దిమ్మతిరిగే ట్విస్ట్ : రాజకీయాల్లోకి మహేష్ బాబు ఎంట్రీ..!

Prince Mahesh Babu has finally decided to enter in politics. He already started the ground work without any noise. Everyone talking about this in film industry. But, there is twist which block everyone’s mind. Read the full story to know about that.

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజమే. ఎవరైతే రాజకీయాల మీద అస్సలు ఆసక్తి లేదని బల్లగుద్దిమరీ చెప్పారో.. ఆ ప్రిన్స్ మహేష్‌బాబే ఇప్పుడు అందులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నాడు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాన్ని తుడిచిపెట్టడం కోసం.. కుళ్ళు, కుతంత్రాలతో మకిలిపట్టిన సమాజాన్ని మార్చడం కోసం.. రాజకీయమే సరైన మార్గమని భావించి.. చివరికి అందులో ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అయితే..ఇదంతా కూడా రియల్ లైఫ్‌లో కాదులెండి, రీల్ లైఫ్‌లో!

తనకు ‘శ్రీమంతుడు’లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మహేష్‌ మరో మూవీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓ సామాజిక మెసేజ్‌తో పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడట కొరటాల. తన సినిమాల ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇచ్చే ఈ డైరెక్టర్.. ఈసారి పొలిటికల్ యాంగిల్‌లో సమాజానికి ఉపయోగపడే ఓ బలమైన మెసేజ్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు.. ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘శ్రీమంతుడు’తో టాలీవుడ్‌నే షేక్ చేసిన కొరటాల, మహేష్.. ఈసారి పొలిటికల్ స్టోరీతో చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ జనవరిలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించాలని, జూన్-జూలైలో చిత్రీకరణ ఫినిష్ చేయాలని యూనిట్ ప్లాన్. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా ముగించి.. ఆగస్టులోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news