Gossipsమరో వివాదం జబర్దస్త్ అందుకే పోలీసులు కేసు నమోదు చేశారా ..? 

మరో వివాదం జబర్దస్త్ అందుకే పోలీసులు కేసు నమోదు చేశారా ..? 

గత ఐదేళ్లుగా బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న షో ఏదైనా ఉందా అంటే అది జబర్డస్త్ కామెడీ ప్రోగ్రామ్. ఇప్పటివరకు దీని ద్వారా మంచి గుర్తింపు పొంది ఇండ్రస్ట్రీలో స్థిరపడ్డారు. ఈ షో ఇప్పటికీ కొనసాగుతూ బుల్లితెర సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. అయితే ఈ షో మీద ఇప్పుడు కొన్ని ఆరోపణలు రావడంతో పోలీసు కేసు వరకు వెళ్ళింది యవ్వారం.

మహిళలను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని గత కొన్ని రోజులుగా జబర్దస్ షో మీద ఆరోపణలు వస్తున్నాయి.  అలాగే హైపర్ ఆది వేసే పంచ్ డైలాగ్ ల మీద కూడా వ్యతిరేకత వస్తోంది. అయితే ఈ మధ్య మహేష్ కత్తి మహేష్ కి , హైపర్ ఆదికి మధ్య దీనిమీద పెద్ద రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీస్ స్టేషన్ లో దీని మీద కేసు కూడా నమోదు అయ్యింది.

వాస్తవంగా  ఈ కార్యక్రమం మరీ శృతి మించుతోంది. అనాథలు, మహిళలు, వికలాంగులను కించపరిచేలా జోకులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. జబర్ధస్త్ కామెడీ షో కి వైసీపీ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయిన భామలు అనసూయ, రష్మీ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news