Gossipsఆ అయిదుగురు నన్ను వాడుకున్నారు .. లక్ష్మి రాయ్ సంచల వ్యాఖ్యలు

ఆ అయిదుగురు నన్ను వాడుకున్నారు .. లక్ష్మి రాయ్ సంచల వ్యాఖ్యలు

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మికి బాలివుడ్ నీళ్లు బాగా వంటబట్టినట్టున్నాయి. అందుకే పచ్చి పచ్చిగా మాట్లాడుతూ కిక్కు పెంచేస్తోంది. ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సినిమా జూలీ -2 . ఈ సినిమా మీద అక్కడ భారీ స్థాయిలో అసలు పెట్టుకున్నారు. ఇప్పుడు లక్ష్మి రాయ్ ఆ హీట్ ని మరింతగా పెంచే ప్రయత్నంలో కాస్తా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన పర్సనల్ ఎఫైర్స్ గురించి ఎటువంటి జంకూ బొంకూ లేకుండా మాట్లాడేసి అందరికి షాక్ ఇచ్చేసింది.

‘జూలీ 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఆ చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించగా.. లక్ష్మీరాయ్‌కి ఎఫైర్స్‌కి సంబంధించి ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె బదులిస్తూ.. గతంలో తాను 5 మందితో డేటింగ్ చేశానని, కానీ ఆ రిలేషన్‌షిప్‌లన్నీ ఎక్కువకాలం నడవలేదని తెలిపింది. ఎందుకంటే వాళ్లందరూ తన రియల్ పర్సనాలిటీని అర్థం చేసుకోలేకపోయారని, తన ఇమేజ్‌ని మాత్రమే అడ్డంగా వాడుకున్నారని వాపోయింది.

ప్రేమ, నమ్మకం అనే పదాలకు ఆ ఐదుగురు ఏమాత్రం అర్హులు కాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాను చాలా సెన్సిటివ్, ఎమోషనల్ పర్సన్ అని చెప్పిన లక్ష్మీ.. ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి తనని అర్థం చేసుకుని, అండగా ఉండాలని ఆశిస్తుందని తెలిపింది. తాను ఎదుర్కొన్న అనుభవాలు తనకు మంచి గుణపాఠాలు నేర్పాయని, తానిప్పుడే మరో రిలేషన్‌షిప్‌ని కోరుకోవడం లేదని లక్ష్మీరాయ్ వెల్లడించింది.

అయితే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యే టైం లో హీరోయిన్స్ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ తో, అలాగే ఎవరో ఒకరి మీద వివాదాస్పద వాఖ్యలు చేయడం ద్వారా అందరి ద్రుష్టి తమ మీద ఉండే విధంగా చేసుకుంటారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఈ హాట్ భామ చేసిన వ్యాఖ్యలు సంచలనమే కలిగిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news