Politicsతప్పు చేశాను.. క్షమించండి - కేసీఆర్

తప్పు చేశాను.. క్షమించండి – కేసీఆర్

ఖమ్మంలో రైతుల చేతీలకు బేడీలు వేయడం తప్పు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందిన కాదని చెప్పిన కేసీఆర్ ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. బంగ్లాదేశ్ లో ప్రొఫెసర్ యూనస్ ఖాన్ పొదుపు ఉద్యమం చేపట్టినట్లు.. ఎస్.కె. డే భారతదేశంలో పంచాయితీ రాజ్ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లు.. తెలంగాణలో రైతుకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, ఇక మా భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసా రైతాంగంలో కలిగే విధంగా పాటలు రాయాలని, వీడియో చిత్రాలు రూపొందించాలని, రచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇప్పటికే రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని పథకాలు తెస్తున్నామని అవన్నీ సక్రమంగా అమలు చేసే బాధ్యతను రైతు సంఘాలకు అప్పగిస్తామని సీఎం వెల్లడించారు. రైతు స్వర్ణ యుగానికి రైతు సంఘాలే నిచ్చెన మెట్లు కావాలని అవి నిజాయితీగా పని చేయాలన్నారు. వ్యవసాయం బాగు పడి రైతు ధైర్యంగా ఉండడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండడం కోసం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news