Moviesకాజల్ కు అదనంగా ఇచ్చారట.. అందుకోసమే అమ్మడు అలా..!

కాజల్ కు అదనంగా ఇచ్చారట.. అందుకోసమే అమ్మడు అలా..!

క్రేజీ బ్యూటీ కాజల్ ఉన్న ఫాంలో ఇప్పుడు ఏ సౌత్ హీరోయిన్ లేదని చెప్పాలి. ఈ శుక్రవారం నేనే రాజు నేనే మంత్రిలో రాధ పాత్రలో కాజల్ మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తేజ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రానా జోగేంద్రగా నటించగా అతని భార్యగా కాజల్ తన సహజ నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం సారీలో కనిపించి అలరించిన కాజల్ పతాక సన్నివేశాల్లో ఫ్యాన్స్ ను ఉద్రేకానికి గురయ్యేలా చేసింది.

ఇక ఇదవరకు కన్నా కాజల్ ప్రత్యేకంగా నేనే రాజు నేనే మంత్రి కోసం ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. తీసుకున్న రెమ్యునరేషన్ కు సినిమా గుమ్మడికాయ కొట్టేదాకా కూడా ఉండటం కష్టమే అనుకున్న ఈరోజులలో కాజల్ మాత్రం రానా సినిమాకు తాను ప్రచారంలో యాక్టివ్ గా పాటిస్పేట్ చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అమ్మడు ఈ ప్రచారం కోసం అదనంగా 30 లక్షలు తీసుకుందట. అందుకే నేనే రాజు నేనే మంత్రి సినిమా గురించి ఎక్కడ ఎప్పుడు అన్నది లేకుండా ప్రమోషన్స్ చేసేస్తుంది. ఇదంతా రెమ్యునరేషన్ చలవే అని తెలిసినా అమ్మడు ఇచ్చిన కమిట్మెంట్ కు కట్టుబడి ఉండటం మెచ్చుకోదగిన విషయమే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news