Gossipsరికార్డులు చాలా చూశా..కానీ ఇది కళ్లల్లో ఆనందం తెచ్చింది..!

రికార్డులు చాలా చూశా..కానీ ఇది కళ్లల్లో ఆనందం తెచ్చింది..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై సింహా. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల కలక్షన్స్ క్రాస్ చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా జరిగిన స్పెషల్ ఈవెంట్ లో బాలయ్య తన సినిమాలు చాలా రికార్డులను క్రియేట్ చేశాయని.. వాటి గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదని అన్నారు.

సినిమా హిట్ అయితే పొంగిపోవడం.. ఫ్లాప్ అయితే కృంగి పోవడం లాంటివి తాను చేయనని అన్నాడు బాలయ్య. మంచి సినిమాలు తీయాలి.. ఇండస్ట్రీ బాగుండాలి అన్నదే తన ఆశని అన్నారు. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని.. అది దైవాదీనం అని అన్నారు బాలయ్య. ఇక జై సింహా విజయం చాలా స్పెషల్ అని.. ఈ సినిమా సక్సెస్ అందరి కళ్లల్లో ఆనందాన్ని చూశానని అన్నారు.

నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతికి పోటీగా వచ్చిన అజ్ఞాతవాసి చేతులెత్తేయడంతో బాలయ్య విన్నర్ గా నిలిచాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news