Gossipsజై లవ కుశ హైలెట్స్ ఇవే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగే..!

జై లవ కుశ హైలెట్స్ ఇవే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న జై లవ కుశ సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా లాగించేస్తున్నారు. సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్న తారక్ తన మూడు పాత్రలకు ఇప్పటికే డబ్బింగ్ మొదలు పెట్టాడు. జై టీజర్ తో సంచలనం సృష్టించిన తారక్ సినిమాను అదే రేంజ్ లో దించాలని చూస్తున్నాడు.

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడటంతో సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సినిమాలో జై సీరియస్ రోల్ చేస్తుండగా మిగతా రెండు పాత్రలు కామెడీ పండిస్తాయని అంటున్నరు. అంతేకాదు సినిమాలో 75 శాతం కామెడీ ఉంటుందని టాక్. కచ్చితంగా సినిమాలో కొత్త ఎన్.టి.ఆర్ ను చూస్తామని చిత్రయూనిట్ చెబుతున్నారు.

బాబి డైరక్షన్ లో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారట. కామెడీ హైలెట్ గా నడిపిస్తూ సినిమాలో ఎమోషన్ ను నడిపిస్తారట. అంతేకాదు మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడే సరికి ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తగా ట్రై చేస్తారట చిత్రయూనిట్. సో ఈ లెక్కన జై లవ కుశ తారక్ ఫ్యాన్స్ కు ఓ ఫీస్ట్ ఇస్తుందని ఫిక్స్ అవ్వొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news